Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హాట్ న్యూస్:'గబ్బర్ సింగ్'నిర్మాతతో రామ్ చరణ్ ఖరారు
హైదరాబాద్ : 'గబ్బర్ సింగ్'తో సూపర్ హిట్ కొట్టిన బండ్ల గణేష్ మరో చిత్రం కమిటయ్యారు. రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం టేకాఫ్ కానుంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ మేరకు స్క్రిప్టు రాసి రామ్ చరణ్ తో ఓకే చేయించుకున్నారు. చాలా కాలం నుంచీ వీరిద్దరూ కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు తీరనుంది. వీరిద్దరి కాంబినేషన్ ట్రేడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వివాహానంతరం కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో జంజీర్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి దర్సకత్వంలో ఎవడు చిత్రం చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు.
బండ్ల గణేష్ విషయానికి వస్తే..గణేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్లతో చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందే ఈ చిత్రం టైటిల్ బాద్షా. పూర్తి కామెడీ ఎంటర్ట్నైమెంట్ తో రూపొందే ఆ చిత్రం మళ్లీ గబ్బర్ సింగ్ రేంజి సినిమా అవుతుందనే నమ్మకంగా ఉన్నారు. అఫ్పుడే బాద్షా చిత్రానికి బిజినెస్ ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉన్నాడు గణేష్. దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
త్రివిక్రమ్ అయితే జులాయి హిట్ తో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చిత్రం రెడీ చేస్తున్నారు. నువ్వు నాకు నచ్చావ్ తరహా కధాంసంతో ఈ చిత్రం స్క్రిప్టు రెడీ అవుతుందని చెప్తున్నారు. జల్సా కాంబినేషన్ లో రెడీ అయ్యే చిత్రం కావటంతో బిజినెస్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ నెలకొనింది. పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది.
ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు.