twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా.. బండ్ల గణేష్ ఆవేదన

    |

    ప్రస్తుతం హైద్రాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఎప్పటిలానే జనాలెవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఓట్లు వేయడం లేదు. జనాలు లేక కొన్ని పోలింగ్ బూత్‌లో సిబ్బంది నిద్రకూడా పోతున్నారు. సెలెబ్రిటీలందరూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. సాధారణ జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం బయటకు రావడం లేదు.

    ఇప్పటి వరకు చిరంజీవి సురేఖ, నాగార్జున అమల, మంచు లక్ష్మీ, కోట శ్రీనివాస్ రావు దంపతులు, యాంకర్ ఝాన్సీ, హీరో రామ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ రెడ్డి ఇలా ఎంతో మంది కదలివచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటలవరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దీనిపై బండ్ల గణేష్ మాత్రం ఆవేదన చెందుతున్నాడు.

     Bandla Ganesh Request People To Cast Vote in GHMC Elections

    దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి ఇది మీ కర్తవ్యం హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ .ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్నా అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా .ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే హక్కును కోల్పోతారు అంటూ ట్వీట్లు చేస్తున్నాడు. సినీ ప్రముఖులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రండి.. ఓట్లు వేసి మీ హక్కును వినియోగించుకుని బాధ్యతను నెరవేర్చుకోండని చెబుతున్నారు.

    English summary
    Bandla Ganesh Request People To Cast Vote in GHMC Elections Chiranjeevi, Nagarjuna Cast Vote in GHMC Elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X