Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా.. బండ్ల గణేష్ ఆవేదన
ప్రస్తుతం హైద్రాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఎప్పటిలానే జనాలెవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఓట్లు వేయడం లేదు. జనాలు లేక కొన్ని పోలింగ్ బూత్లో సిబ్బంది నిద్రకూడా పోతున్నారు. సెలెబ్రిటీలందరూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. సాధారణ జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం బయటకు రావడం లేదు.
ఇప్పటి వరకు చిరంజీవి సురేఖ, నాగార్జున అమల, మంచు లక్ష్మీ, కోట శ్రీనివాస్ రావు దంపతులు, యాంకర్ ఝాన్సీ, హీరో రామ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ రెడ్డి ఇలా ఎంతో మంది కదలివచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటలవరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దీనిపై బండ్ల గణేష్ మాత్రం ఆవేదన చెందుతున్నాడు.
దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి ఇది మీ కర్తవ్యం హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ .ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్నా అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా .ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే హక్కును కోల్పోతారు అంటూ ట్వీట్లు చేస్తున్నాడు. సినీ ప్రముఖులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రండి.. ఓట్లు వేసి మీ హక్కును వినియోగించుకుని బాధ్యతను నెరవేర్చుకోండని చెబుతున్నారు.