Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వెండితెరపై మహాత్మా గాంధీ ముని మనవడు
మొన్నా మధ్య కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మహాత్మా(శ్రీకాంత్, భావన) చిత్రం ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా విచ్చేసిన తుషార్ గాంధీ త్వరలో వెండి తెరపై కనిపించనున్నారు. తుషార్ గాందీ జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు అన్న సంగతి తెలిసిందే. గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న 'రోడ్ టు సంగం' అనే చిత్రంలో తుషార్ నటిస్తున్నారు. అమిత్రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు పరేష్ రావల్, ఓంపురి, పవన్ మల్హోత్రా, స్వాతి చిట్నిస్ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఈనెల 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం పబ్లిసిటీ కాంపయిన్ లో తుషార్ గాందీ విరివిగా పాల్గొనే ఆవకాశం ఉంది. అలాగే తన తాతగారి సిద్దాంతాలను గానీ, జీవిత చరిత్రలను గానీ అనుసరించి చేస్తున్న చిత్రాలలో తాను నటించటానికి ముందుకు వస్తానని ఆయన తెలియచేసారు. సినిమా అనేది గొప్ప మీడియం అని దాని ద్వారా గాంధీ సిద్దాంతాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశం కలుగుతుందని దానని తాను వదులుకోలదల్చుకోలనని ఆయన మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.