ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మన కమర్షియల్ మాస్ హీరోల డబ్బింగ్ సినిమాలకు హిందీ ఆడియెన్స్ నుంచి అయితే రెస్పాన్స్ బాగానే వస్తోంది. అయితే డైరెక్ట్ గా మన హీరోల సినిమాలు విడుదలైతే నార్త్ జనాలు థియేటర్స్ వరకు వస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తన దృష్టిని మొత్తం బాలీవుడ్ సినిమాపైనే పెట్టాడు. ఛత్రపతి కథను బెల్లంకొండ బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని బెల్లంకొండ తన దృష్టిని మొత్తం ఆ సినిమాపైనే పెడుతున్నాడు.
మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా చేయడానికి ఒప్పుకోవడం లేదట. రాక్షసుడు సినిమా కంటేముందే బెల్లంకొండ ఒక రెండు తెలుగు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు. వాటిని కూడా ఇప్పట్లో సెట్స్ పైకి తెచ్చే ఛాన్స్ లేదని సమాచారం. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు కొన్నిరోజులు వర్క్ షాప్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి ప్రభాస్ కెరీర్ కి ఒక యూ టర్న్ ఇచ్చిన ఛత్రపతి కథ బెల్లంకొండ వారసుడి జీవితాన్ని ఎంతవరకు చేంజ్ చేస్తుందో చూడాలి.
Wallpapers in the Tollywood industry means an unknown buzz at the box office. This time, however, the collection dose was slightly reduced due to the corona lock down, but in a way, the wallpapers gave a good boost to the wallpapers. It is known that on January 14, along with the movie Red, his son-in-law Adurs came forward to the audience. If you take a look at the collections obtained on the first day of the movie ..
Story first published: Friday, January 22, 2021, 13:49 [IST]