Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మన కమర్షియల్ మాస్ హీరోల డబ్బింగ్ సినిమాలకు హిందీ ఆడియెన్స్ నుంచి అయితే రెస్పాన్స్ బాగానే వస్తోంది. అయితే డైరెక్ట్ గా మన హీరోల సినిమాలు విడుదలైతే నార్త్ జనాలు థియేటర్స్ వరకు వస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తన దృష్టిని మొత్తం బాలీవుడ్ సినిమాపైనే పెట్టాడు. ఛత్రపతి కథను బెల్లంకొండ బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని బెల్లంకొండ తన దృష్టిని మొత్తం ఆ సినిమాపైనే పెడుతున్నాడు.
మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా చేయడానికి ఒప్పుకోవడం లేదట. రాక్షసుడు సినిమా కంటేముందే బెల్లంకొండ ఒక రెండు తెలుగు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు. వాటిని కూడా ఇప్పట్లో సెట్స్ పైకి తెచ్చే ఛాన్స్ లేదని సమాచారం. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు కొన్నిరోజులు వర్క్ షాప్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి ప్రభాస్ కెరీర్ కి ఒక యూ టర్న్ ఇచ్చిన ఛత్రపతి కథ బెల్లంకొండ వారసుడి జీవితాన్ని ఎంతవరకు చేంజ్ చేస్తుందో చూడాలి.