Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా హృదయానికి దగ్గరైన చిత్రం.. బెల్లకొండ ఎమోషనల్
బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు. అయితే మొదటి చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక బెల్లంకొండ వారసుడు మాత్రం ఎప్పుడూ కూడా స్టార్ హీరోయిన్లనే తన సినిమాలో పెట్టుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా హీరోగా నిలబడటానికి చాలానే కష్టపడ్డాడు. మొత్తానికి జయ జానకీ నాయక చిత్రంతో మొదటి సక్సెస్ను రుచి చూశాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ను మాస్ హీరోగా నిలబెట్టేందుకు బోయపాటి శ్రీను బాగానే శ్రమించాడు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హై ఎమోషన్స్తో బెల్లంకొండ వారసుడికి మంచి విజయమే దక్కింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, శరత్ కుమార్, నందు, జగపతి బాబు వంటి వారు హైలెట్గా నిలిచారు. ఈ సినిమాకు మూడేళ్లు నిండటంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
జయ జానకీ నాయన విడుదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్ చేస్తూ.. 'ఈ చిత్రం నా హృదయానికి అతి దగ్గరైన చిత్రం.. ఈ సినిమాకు వచ్చిన ఆధరణ నాకు ఇప్పటికీ గుర్తుంది. మీ అందరి అనన్యమైన ప్రేమ, అభిమానులు, సపోర్ట్కు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను' అని ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంలోనే బోయపాటి శ్రీను, రకుల్ ప్రీత్, దేవీ శ్రీ ప్రసాద్, ప్రగ్యా జైస్వాల్ను గుర్తు చేసుకున్నాడు. బెల్లంకొండ చివరగా రాక్షసుడు చిత్రంతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.