Don't Miss!
- News TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్ధుల ప్రకటనకు ముహుర్తం ఖరారు..!
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
నా హృదయానికి దగ్గరైన చిత్రం.. బెల్లకొండ ఎమోషనల్
బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు. అయితే మొదటి చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక బెల్లంకొండ వారసుడు మాత్రం ఎప్పుడూ కూడా స్టార్ హీరోయిన్లనే తన సినిమాలో పెట్టుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా హీరోగా నిలబడటానికి చాలానే కష్టపడ్డాడు. మొత్తానికి జయ జానకీ నాయక చిత్రంతో మొదటి సక్సెస్ను రుచి చూశాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ను మాస్ హీరోగా నిలబెట్టేందుకు బోయపాటి శ్రీను బాగానే శ్రమించాడు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హై ఎమోషన్స్తో బెల్లంకొండ వారసుడికి మంచి విజయమే దక్కింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, శరత్ కుమార్, నందు, జగపతి బాబు వంటి వారు హైలెట్గా నిలిచారు. ఈ సినిమాకు మూడేళ్లు నిండటంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
జయ జానకీ నాయన విడుదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్ చేస్తూ.. 'ఈ చిత్రం నా హృదయానికి అతి దగ్గరైన చిత్రం.. ఈ సినిమాకు వచ్చిన ఆధరణ నాకు ఇప్పటికీ గుర్తుంది. మీ అందరి అనన్యమైన ప్రేమ, అభిమానులు, సపోర్ట్కు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను' అని ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంలోనే బోయపాటి శ్రీను, రకుల్ ప్రీత్, దేవీ శ్రీ ప్రసాద్, ప్రగ్యా జైస్వాల్ను గుర్తు చేసుకున్నాడు. బెల్లంకొండ చివరగా రాక్షసుడు చిత్రంతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.