బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం చెప్పబోతున్నాడు !
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇటీవల విడుదల చేసిన సాక్షం సినిమా టీజర్ తోపాటు సౌందర్య లహరి సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామ సమర్పణలో రూపొందుతున్న సినిమా 'సాక్ష్యం'. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. జూలై 20న సినిమాను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాశీ, పోల్లాచి, రాజమండ్రి, న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది.
కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాయడం జరిగింది. తమన్ సంగీతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కానుందని సమాచారం. ఇటీవల విడుదల చేసిన సాక్షం సినిమా టీజర్ తోపాటు సౌందర్య లహరి అనే మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది.


Click it and Unblock the Notifications











