Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కొడుకు కోసం హీరోయిన్పై కన్నేసిన నిర్మాత.. కోటి సమర్పించుకోవడానికి సిద్ధం
దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం నిర్మిస్తూనే.. డిక్టేటర్ దర్శకుడు శ్రీవాస్తో తన కుమారుడి కోసం మరో సినిమాపై దృష్టిపెట్టాడు నిర్మాత బెల్లంకొండ సురేష్.
దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం నిర్మిస్తూనే.. డిక్టేటర్ దర్శకుడు శ్రీవాస్తో తన కుమారుడి కోసం మరో సినిమాపై దృష్టిపెట్టాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. తన కుమారుడు బెల్లంకొండ శ్రీను కోసం స్టార్ హీరోయిన్లను రంగంలోకి దించిన దాఖలాలు గతంలో ఉన్నాయి. అల్లుడు శ్రీను కోసం సమంతను, ఆ తర్వాత సినిమాలో తమన్నాను శ్రీను సరసన నటించేలా చేశాడు. అందుకోసం భారీగానే ముట్టుజెప్పినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి రూపొందిస్తున్న చిత్రంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. తదుపరి చిత్రం కోసం పూజా హెగ్డేపై నిర్మాత సురేష్ దృష్టిపెట్టినట్టు సమాచారం.
డిక్టేటర్ శ్రీవాస్ చిత్రానికి పూజా హెగ్డే..
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రాన్ని డిక్టేటర్ దర్శకుడు శ్రీవాస్తో ప్లాన్ చేశాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. తెలుగులో హాట్ హాట్గా మంచి జోరు మీద ఉన్న పూజాహెగ్డే అయితే సరైన జోడి అని భావిస్తున్నాడట. అనుకున్నదే తడువుగా పూజాతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తున్నది.
కీర్తీ సురేశ్ పేరు పరిశీలనలో..
శ్రీనివాస్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చే చిత్రం కోసం తొలుత కీర్తీ సురేష్ పేరును పరిశీలించినట్టు సమాచారం. అయితే పూజా హెగ్డే అయితే బాగుంటుందనే దర్శకుడి సూచనతో నిర్మాత సురేష్ మనసు మార్చుకొన్నట్టు తెలుస్తున్నది. పూజాను సంప్రదించగా సుమారు రూ.కోటి రూపాయల వరకు డిమాండ్ చేసినట్టు తెలిసింది. అందుకు సురేశ్ కూడా సిద్ధపడినట్టు తెలుస్తున్నది.
దువ్వాడ జగన్నాథంలో..
మిస్ ఇండియా పూజా హెగ్డే 2010లో మిస్ యూనివర్స్ రన్నరప్గా నిలిచింది. తొలుత తమిళంలో ముగమూడి అనే చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైంది. టాలీవుడ్లో అక్కినేని నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్తో కలిసి ముకుంద చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఓ మోస్తారు విజయాన్ని సాధించాయి.
పూజా హెగ్గే కోసం భారీ ఆఫర్
ఈ మధ్య కాలంలో హిందీలో హృతిక్ రోషన్తో మొహంజదారో చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం దారుణమైన ఫ్లాఫ్ను మూటగట్టుకొన్నది. తాజాగా అల్లు అర్జున్ చిత్రం దువ్వాడ జగన్నాథంలో నటించింది. ఈ చిత్రం పూజా హెగ్డేకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతున్నది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే పూజా హెగ్డేను తీసుకోవాలని చూస్తున్నారట.