Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డైరెక్టర్ మాయచేసాడు: నిజం బయట పెట్టిన అనుష్క!
హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో 'భాగమతి' సినిమా వస్తోందంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు నలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. 'భాగమతి' అనే టైటిల్ చూసి ఇది చారిత్రక చిత్రమనే ఇంతకాలం భావించారు.
17వ శతాబ్దం రాజు కులీ కుతుబ్ షా, ఆయన భార్య భాగమతి స్టోరీ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని ఇంతకాలం ప్రచారం జరిగింది. ఇది హైదరాబాద్ చరిత్రతో ముడిపడి ఉన్న కథగా భావించి చాలా మంది ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు.
అయితే తాజాగా 'భాగమతి' చిత్రానికి అంత సీన్ లేదని తేలిపోయింది. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదు...మామూలు థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయే డైరెక్టర్ అశోక్(పిల్ల జమిందార్ ఫేం) కావాలనే ఇంతకాలం అసలు విషయం దాచి హైదరాబాద్ చరిత్ర మీద ప్రేక్షకులకున్న వీక్ నెస్ తో ఆడుకున్నాడు, తన ప్రాజెక్టు జనాల్లో బాగా నానాలని, పబ్లిసిటీ రావాలని మాయచేసాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క 'భాగమతి' ప్రాజెక్టుకు సంబంధించిన అసలు విషయం చెప్పింది. 'నేను చేస్తోంది కేవలం ఒక థ్రిల్లర్ సినిమా. 17వ శతాబ్దానికి చెందిన చరిత్ర అని చాలామంది అనుకుంటున్నారు. కాని ఇక్కడ అనుకున్న కథ వేరు. భాగమతి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్ సినిమా' అని తేల్చి చెప్పింది.