Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
వైయస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘భగీరథుడు’
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా మలిచారు. ప్రచార కమిటీ నిర్వాహకుడు, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ గౌరవాద్యక్షుడు గిరిరెడ్డి దీనికి నిర్మాత, దర్శకుడు. వైయస్ తో తనకున్న అనుభవం, ఆయనపై తనకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సాయి యూనివర్శల్ ఫిలిమ్స్పై తొలి ప్రయత్నంగా 'భగీరథుడు" అనే చిత్రాన్ని నిర్మించాం. జనహృదయ నేత కోట్లాది మంది హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం గురించి తెలియజేశాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు. చిత్రం గురించి చెపుతూ... వినోద్ కుమార్, యమున వైయస్ దంపతులుగా నటించారు. రెండవసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే సినిమా తీయాలని అనుకున్నాను. ఆయన వ్యక్తిగతం చూస్తే ఆయనలో రియల్ హీరో ఉన్నారు. ఎంతోమందిని ఆయన కాపాడారు.
కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే తనకంటే జూనియర్ అయిన కేవీపిని కాపాడారు. అలా వారిద్దరి మధ్య స్నేహ సంబంధం కలిగింది. అలాగే ఎంతోమంది విద్యార్థులకు ఫీజులు కట్టారు. డాక్టర్గా రూపాయికే వైద్యం చేశారు. ఇటువంటివి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటిని తెలియజెప్పే ఉద్దేశ్యమే ఈ చిత్రం. రాజకీయపరంగా విమర్శులున్నా వాటి జోలికి వెళ్లలేదు. ఈ చిత్రంలో ఏ రాజకీయ పార్టీని, నాయకడిని విమర్శించలేదు. ఆయన వ్యక్తిగతంగా ఏం చేశారనదే పాయింట్. ఈ చిత్రం క్లైమాక్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుందన్నారు. ఈ నెలఖారులో జగన్ ఆధ్వర్యంలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.
ఈ చిత్రంలో మంజుభార్గవి, కెప్టెన్ చౌదరి, శ్రీహర్ష, పృధ్వీ, టార్జాన్, అశోక్ కుమార్, హాసిని తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయ్ కుమార్, డాన్స్: స్వర్ణ, సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గిరిరెడ్డి