Don't Miss!
- News Arvind kejriwal నేడు కోర్టులో బాంబు పేల్చనున్నారా? సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!!
- Sports SRH vs MI: హార్దిక్ వల్లే ఓటమి.. చెత్త కెప్టెన్సీ - మాజీ క్రికెటర్లు
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
నక్సలైట్ భార్యగా మారిన 'ప్రేమ పావురాలు' భాగ్యశ్రీ
తెలుగు, హిందీ భాషల్లో రిలీజై సంచలనం సృష్టించిన ప్రేమ పావురాలు చిత్రాన్ని అందులో నటించిన భాగ్యశ్రీని మర్చిపోవటం కష్టమే. ఆమె తాజాగా నక్సలైట్ భార్యగా కనిపిస్తూ రీ ఎంట్రీ ఇవ్వనుంది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 'రెడ్ అలర్ట్' చిత్రంలో ఆమె నక్సలైట్ గా చేస్తున్న సునీల్ శెట్టి భార్యగా కనిపించనుంది. మన రాష్ట్రంలో జరిగిన ఓ యదార్ద సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెపుతూ...తాను నర్సింహా(సునీల్ శెట్టి)కి భార్యగా కపిస్తానని చెప్పింది. గత్యంతరం లేక నర్సింహ నక్సలైట్గా మారి విధ్వంసాలు సృష్టిస్తుంటాడని పేర్కొంది. అయితే మావోయిస్టు ఉద్యమంపై పెద్దగా అవగాహన లేకుండానే తాను ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించానని, తన భర్త ఇంటికి తిరిగి వస్తాడో లేదో కూడా తెలియని ఇల్లాలిగా తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తోంది.
మావోల కదలికల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఈ చిత్రంలో నక్సలైట్స్ సమస్యలు, ప్రభత్వ చర్యలు, టెర్రరిజం అనే విషయాలు చుట్టూ కథ సాగుతుంది. నరసింహ అనే ఓ పేద వంటవాడి పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించారు. కథ ప్రకారం నరసింహం తన పిల్లాడి చదువుకోసం డబ్బు అవసరమై నక్సలైట్ ఉద్యమంలో ఇరుక్కుంటాడు. మొదట్లో వంటవాడిగా ఉన్నా ఆ తర్వాత వెపన్స్ ట్రైనింగ్, కిడ్నాప్ లు వంటివి చేయాల్సి వస్తుంది. అయితే ఆ నక్సలైట్ లీడర్(ఆశిష్ విద్యార్ధి)తో తగువు వస్తుంది. అయితే అనుకోని పరిస్దితుల్లో తన చేతులోకి మొత్తం గ్రూప్ ని తీసుకుని నడిపించాల్సి వస్తుంది. అప్పుడు అతను వెనక్కి వచ్చి తన కుటుంబంతో ఉన్నాడా లేక ఉద్యమాన్నికొనసాగించాడా అన్న విషయాలతో కథనం ఆసక్తి కరంగా నడుస్తుంది. అనంత్ మహదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా జూలై 9న చిత్రాన్ని విడుదల కానుంది.