Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కాదు కాదు... తెలుగు సినిమా పుట్టినరోజు నేడే!
తెలుగులో తొలి టాకీ మూవీ విడుదలై నేటితో 84 సంవత్సరాలు పూర్తి చేసుకుని 85వ వసంతంలోకి అడుగు పెడుతోంది. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తయారైన తొలి తెలుగు టాకీ 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. అయితే తెలుగు సినిమా పుట్టినరోజు గురించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి.
భారతీయ తొలి టాకీ 'ఆలంఆరా' విడుదలైన ఆరు నెలల తర్వాత అంటే 1931 సెప్టెంబర్ 15న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడులైందని కొందరు వాదిస్తున్నప్పటికీ....అది వాస్తవం కాదనీ, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న తొలి తెలుగు టాకీ సినిమా విడుదలైందని తర్వాత ఆధారాలతో సహా తేల్చారు పాత్రికేయులు రెంటాల జయదేవ. జయదేవ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం ఈ సినిమా చెన్నయ్లో విడుదల కావడానికి మరో రెండు నెలలు పట్టింది. కాగా 'భక్తప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైందనే విషయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ అంగీకరించక పోవడం గమనార్హం.
ఆ వివాదం సంగతి పక్కన పెట్టి ‘భక్త ప్రహ్లాద' సినిమా వివరాల్లోకి వెళితే...హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా' అర్దేషిర్ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్.ఎమ్.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద'ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20 వేల రూపాయలు మాత్రమే.
భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతికాలంలో దర్శకునిగా మారిన ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఎల్.వి.ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ కాళిదాసులో కూడా నటించారు.
కాగా...టాకీల ఆవిర్భావంతో సినిమా ఎవరూ ఊహించనంత మార్పులకు లోనయింది. ఆంగ్లో ఇండియన్లు, 'మూకీ మహారాజులు'గా వెలుగొందిన ఎంతోమంది టాకీల రాకతో క్రమేపీ తమ ప్రాభవాన్నీ, ప్రతిష్టనూ కోల్పోయారు. అప్పటివరకూ భాషాబేధాలు లేకుండా అందరినీ సమానంగా అలరించిన సినిమా ప్రేక్షకుల మధ్య కొత్త గోడల్ని ఏర్పరచింది. దీని ప్రభావం వల్ల ఎవరికి వారు తమ భాషలోనే చలనచిత్రాలు ఉండాలన్న కోరికను వ్యక్తం చేయసాగారు.