Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భాను కిరణ్ లింక్స్: అజ్ఞాతంలో తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్తో కలిసి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సినీ నిర్మాత కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థలంకబ్జా చేశారంటూ ఆయనపై రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదైందని, అతడి అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశామని మాదాపూర్ ఎసీపీ గోవర్దన్రెడ్డి చెప్పారు. ప్రస్తుతం కళ్యాణ్ పరారీలో ఉన్నారని తెలిపారు. రాయదుర్గం సమీపంలోని ఖాజాగూడ గ్రామం వద్ద సర్వే నంబరు 40లో సి.కళ్యాణ్ తన స్థలం పక్కనే ఉన్న 300 గజాల స్థలాన్ని కబ్జాచేశారు. దాన్ని కొన్ని నెలల క్రితం హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక శానససభ్యుడి కుమారుడికి విక్రయించారు. ఎమ్మెల్యే కుమారుడు ఆ స్థలాన్ని తన స్వాధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ స్థలం సొంతదారుడైన ఓ నాయకుడు అడ్డుపడ్డారు.
డిసెంబరు నెల చివరివారంలో హైదరాబాద్కు వచ్చిన సూరికి సి.కళ్యాణ్ ఈ విషయం చెప్పడంతో సూరి తనదైన శైలిలో 'సెటిల్' చేశాడు. ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో డిసెంబరు 31న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. స్థలం అసలు యజమాని అడ్డుపడ్డారు. అతన్ని బెదిరించేందుకు సి.కళ్యాణ్ తన అనుచరులను, సూరి అనుచరులను పంపారు. అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మోసపోయానని తెలుసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, స్థలాన్ని అమ్మిన సి.కళ్యాణ్పై రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఇప్పటివరకూ ఇద్దరిని అరెస్ట్ చేశారు. కల్యాణ్ పరారీలో ఉన్నారు.