Don't Miss!
- News మే 10న అక్షయ తృతీయ.. ఈ రాశులపై కనక వర్షం
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
భాను కిరణ్ లింక్స్: అజ్ఞాతంలో తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్తో కలిసి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సినీ నిర్మాత కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థలంకబ్జా చేశారంటూ ఆయనపై రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదైందని, అతడి అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశామని మాదాపూర్ ఎసీపీ గోవర్దన్రెడ్డి చెప్పారు. ప్రస్తుతం కళ్యాణ్ పరారీలో ఉన్నారని తెలిపారు. రాయదుర్గం సమీపంలోని ఖాజాగూడ గ్రామం వద్ద సర్వే నంబరు 40లో సి.కళ్యాణ్ తన స్థలం పక్కనే ఉన్న 300 గజాల స్థలాన్ని కబ్జాచేశారు. దాన్ని కొన్ని నెలల క్రితం హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక శానససభ్యుడి కుమారుడికి విక్రయించారు. ఎమ్మెల్యే కుమారుడు ఆ స్థలాన్ని తన స్వాధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ స్థలం సొంతదారుడైన ఓ నాయకుడు అడ్డుపడ్డారు.
డిసెంబరు నెల చివరివారంలో హైదరాబాద్కు వచ్చిన సూరికి సి.కళ్యాణ్ ఈ విషయం చెప్పడంతో సూరి తనదైన శైలిలో 'సెటిల్' చేశాడు. ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో డిసెంబరు 31న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. స్థలం అసలు యజమాని అడ్డుపడ్డారు. అతన్ని బెదిరించేందుకు సి.కళ్యాణ్ తన అనుచరులను, సూరి అనుచరులను పంపారు. అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మోసపోయానని తెలుసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, స్థలాన్ని అమ్మిన సి.కళ్యాణ్పై రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఇప్పటివరకూ ఇద్దరిని అరెస్ట్ చేశారు. కల్యాణ్ పరారీలో ఉన్నారు.