Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మొత్తానికి ‘వరుడు’ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా బుక్ అయ్యింది
అల్లు అర్జున్ 'వరుడు"చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా ఆ తర్వాత ఆమెకు సినిమాలు ఏమీ రాలేదు. తను ఆ సినిమాలో నటించి తప్పు చేసానని ఎంత మొత్తుకున్నా ఆమెకు కెరీర్ ప్రారంభం కాలేదు. అయితే ఇన్నాళ్ళకు ఆమెను ఓ కొత్త బ్యానర్ వారు బుక్ చేసారు. అది ఓ ప్రేమ కథ. రంగా రవీందర్గుప్తా దర్శకత్వంలో తిరుమల మూవీ క్రియేషన్స్ పతాకంపై జె.కృష్ణారెడ్డి, జి.వేణుమాధవ్, కె.రాముగౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా ఉదయ్తేజ్ హీరోగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రం గురించి భానుశ్రీ మెహ్రా మాట్లాడుతూ -''తెలుగులో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. 'వరుడు" తర్వాత తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చే శాను"" అంది. చంద్రమోహన్, రంగనాథ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.డి.జాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంతోష్కుమార్.