Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు అర్జున్ హీరోయిన్ సాయికుమార్ సరసన
అల్లు అర్జున్ తో వరుడు చిత్రంలో చేసిన భానుశ్రీ మెహ్రా గుర్తుందా. ఆమె తాజాగా సాయికుమార్ సరసన 'చిలుకూరు బాలాజీ' చిత్రంలో చేస్తోంది. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'చిలుకూరు బాలాజీ'. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రధారులు. ఈటీవీ, ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రై.లి.సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ... ఆ వూళ్లో ఓ పెద్ద మోతుబరి... మాధవుడు. దేవుడికంటే అతను తన మనస్సాక్షినే ఎక్కువగా నమ్ముతాడు. అయితే ఆయన జీవితంలో చోటు చేసుకొన్న ఓ అనుకోని సంఘటనతో దేవుడున్నాడనే నిజం తెలిసొస్తుంది. ఆ తరవాత మాధవుడు ఏం చేశాడు? ఇంతకీ అతనికి కనిపించిన ఆ దైవం ఏం చెప్పింది? లాంటి విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు.
అలాగే దర్శకుడు మాట్లాడుతూ ''వరాల స్వామిగా వినుతికెక్కారు చిలుకూరు బాలాజీ. ఆయన మహిమల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం. నాలుగు శతాబ్దాల చరిత్రను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. వచ్చే నెల చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మండువా లోగిలిలో సాయికుమార్, భానుశ్రీ మెహ్రాలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సునీల్ శర్మ, ఏవీయస్, రఘునాథ్ రెడ్డి, శివపార్వతి, నారాయణరావు, శోభ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: అజయ్శాంతి, సంగీతం: అర్జున్, హంసలేఖ.