Don't Miss!
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
పలాస 1978: సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం 'పలాస 1978'. ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో విడుదలకు ముందే ఈ సినిమా విశేషాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇటీవలే సెన్సార్ సభ్యులు వీక్షించి ప్రశంసలు గుప్పించడం విశేషం. మార్చి 6న విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
సెన్సార్ సర్టిఫికెట్ పొందాక మీడియాతో మాట్లాడిన దర్శకుడు కరుణ కుమార్.. ''సెన్సార్ బోర్డ్ ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమీటీకి వెళ్ళాం. అక్కడ పలాస 1978 చూసిన బృందం ఈ సినిమాను ప్రశంసించారు. వారికి నా ధన్యవాదాలు.
తెలుగు సినిమాలలో 'పలాస 1978' భిన్నమైనదని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకు కథ నుండి రిలీజ్ వరకూ మాకు అండగా నిలుస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ గారికి చాలా థాంక్స్. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.