Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. వంద దాటింది, అయినా!
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ ముఖ్యమంత్రిగా మహేష్ నటనతో అదరగొట్టాడు. మహెష్ బాబు వన్ మాన్ షోలా ఈ చిత్రం సాగింది. పొలిటికల్ చిత్రం అయినప్పటికీ దర్శకుడు కొరటాల అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళని సాధించిన చిత్రంగా నిలిచింది.
రెండవసారి కూడా
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం ఇది. తొలి చిత్రం శ్రీమంతుడు ఘనవిజయం సాధించగా రెండవ చిత్రం భారత అనే నేను కూడా అదేస్థాయి విజయాన్ని అందుకుంది. తొలి నుంచే పాజిటివ్ టాక్ తో అత్యధిక వసూళ్లు సాధించింది.
నెల రోజుల్లోనే
ఈ చిత్రం నెలరోజుల్లోనే 100 కోట్ల షేర్ సాధించింది. 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మహేష్ కెరీర్ లో ఇదే అత్యధిక వసూళ్లు అన్ని చెప్పవచ్చు.
తాజా కలెక్షన్స్
తాజా వివరాల ప్రకారం భరత్ అనే నేను చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇందులో తెలుగురాష్ట్రాల షేర్ 73 కోట్లు ఉంది. శ్రీమంతుడు వంటి ఘనవిజయం తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలతో కొన్ని ఏరియాలలో స్థాయికి మించి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
100 కోట్లు దాటినప్పటికీ
భారీ అంచనాలతో అంతే భారీగా జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ వలన కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ కు కొంత మేర నష్టం తప్పేలా లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినప్పటికీ భారీ ప్రీరిలీజ్ బిజినెస్ వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.