Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భరత్ బహిరంగ సభ లైవ్: పోకిరి, యమదొంగ కలిస్తే నేను ప్రొడ్యూసర్ అవుతా.. బ్రహ్మాజీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ ప్రారంభం అయింది వరుసగా ప్రముఖులు ప్రసంగిస్తున్నారు. ప్రముఖ నటుడు క్యారక్టర్ ఆరిస్ట్ అయిన బ్రహ్మాజీ అద్భుతంగా ప్రసంగించారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. మహేష్ బాబుని, ఎన్టీఆర్ ని ఓ ప్రేములో చూస్తుంటే తనకు ఓ ఐడియా వస్తోందని బ్రహ్మాజీ అన్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు లని పెట్టి దేవుచేసిన మనుషులు చిత్రం తీయాలని ఉందని బ్రహ్మాజీ అన్నారు. పోకిరి, యమదొంగ కలిస్తే తాను ప్రొడ్యూసర్ గా మారుతానని బ్రహ్మాజీ అన్నారు. తరువాతి చిత్రం మహేష్ బాబుతో తెస్తున్నట్లు కొరటాల శివ జనతా గ్యారేజ్ షూటింగ్ లోనే చెప్పారు. ఆ చిత్రంలో నీకు మంచి పాత్ర ఇస్తా అని అప్పుడే మాట ఇచ్చారు. అన్నట్లుగా ఆయన మాట నిలబెట్టుకున్నారని బ్రహ్మాజీ అన్నారు.
మాట నిలబెట్టుకోవడం గురించే ఈ చిత్రం ఉంటుందని బ్రహ్మాజీ అన్నారు. ఇలాంటి విషయాలని కొరటాల శివ పాటిస్తారని, ఆ తరువాతే తన చిత్రాల్లో పొందుపరుస్తారని బ్రహ్మాజీ అన్నారు. ఓ మంచి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారని అన్నారు. భరత్ అనే నేను చిత్రం చూసాక 2, 3 గంటలు ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటారని బ్రహ్మాజీ తెలిపారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఓ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ మరో స్టార్ హీరో ఫంక్షన్ కు వచ్చి చరిత్ర సృష్టిస్తున్నారని బ్రహ్మాజీ ప్రశంసించారు. చిత్ర యూనిట్ కు, విచ్చేసిన అతిధులకు కృతజ్ఞతలు తెలిపి తన ప్రసంగాన్ని ముగించారు.