Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
భరత్ అను నేను ఆఢియో.. ప్రకాశ్ రాజ్కు చేదు అనుభవం
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ప్రిన్స్ మహేష్బాబు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి, ప్రకాశ్ రాజ్, దేవీ శ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనిల్ సుంకర, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు.
భరత్ అనే నేను సినిమా వేడుక వచ్చిన జనాన్ని చూస్తే ఆనందం వేసింది. అంతకంటే నా ఫేవరేట్ యాక్టర్లు మహేష్బాబు, ఎన్టీఆర్ను చూస్తుంటే ఇంకా చాలా ఆనందం వేసింది. వారంటే నాకు చాలా గౌరవం ఉంది. కొరటాల శివతో మిర్చి సినిమాలో చేయాల్సి ఉంది. ఆ తర్వాత శివ తీసిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాలు చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమా అనేది చాలా వ్యయంతో కూడుకొన్నది. తెలుగు సినిమా అంటే వినోదమే కాదు అని మాట్లాడుతుండగా ప్రేక్షకులు గొడవ చేయడంతో ప్రకాశ్ రాజ్ మధ్యలోనే ప్రసంగాన్ని ఆపివేసి వెళ్లారు.