బాలయ్య భారీ కానుక

భారవిగా 'అన్నమయ్య', 'శ్రీ మంజునాథ', 'శ్రీరామదాసు' చిత్రాలకు స్క్రిప్టును సమకూర్చి, సంభాషణలు రాసి పాపులర్ అయ్యారు. భక్తిరస చిత్రాలు కు కేరాఫ్ ఎడ్రస్ రచయితగా మారారు. అంతేగాక ఆయన పనిచేసిన మిగతా సినిమాలు యేవి జనానికి పట్టలేదు. కొన్నాళ్ల క్రితం 'ఫ్యాన్స్' అనే సినిమాను డైరెక్ట్ చేశారు కానీ, అదీ విడుదలకు నోచుకోలేదు. దాంతో పూర్తిగా పురాణ సంబంధ చిత్రాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు పాండు రంగడు చిత్రం కూడా భక్త పుండరీకుడు కథ. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పుడీ సంఘటనతో బాలయ్య చాలాకాలం తర్వాత సినిమా బాగా వచ్చిందని పూర్తి స్థాయి సంతృప్తి తో ఉన్నారని తెలుస్తోంది. దాంతో పాండు రంగడు విజయం గ్యారంటి అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సమకూర్చిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్నాయి.


Click it and Unblock the Notifications











