Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'అష్టాచెమ్మ' ప్రాణం తీసింది
ఇలాంటి ఘటనలకు అసూయే అసలు కారణమని పోలీసు అధికారులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతలతోపాటు అదే స్థాయిలో అపార్థాలకూ నిలయమైన సినీ పరిశ్రమలో ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయని ఓ ఉన్నతాధికారి విశ్లేషించారు. సినీ పరిశ్రమలో నటీనటులు ఒకరికొకరు సన్నిహితంగా ఉండటం మామూలు విషయమని, ఇదే అనేక రకాల అపార్థాలకు తావిస్తోందని, అడపాదడపా ప్రాణాంతకంగా మారుతోందని ఆ అధికారి వివరించారు. అందుకే సినీ వ్యామోహంతో రాజధానికి చేరుకునే వారు ముఖ్యంగా యువతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సినిమాల బిజీలో స్నేహితుల్నీ.. బంధువుల్నీ పట్టించుకోకపోవడం అపార్థాలకు దారితీస్తోందని ఆయన అంటున్నారు.
ఈ సందర్భంగా ఇదే తరహాలో మరణించిన ప్రత్యూష లాంటి మరికొందరు పేర్లు సైతం ప్రస్తావనకు వస్తున్నాయి. వారిలో శోభ(మనవూరి పాండవులు); దివ్యభారతి (మృతి 1993 ఏప్రిల్ 5); సిల్క్స్మిత(మృతి 1996 సెప్టెంబరు 23); అలేఖ్య(పెళ్లిసందడిలో నటించింది.. మృతి 2007 ఆగస్టు 8); ఫటాఫట్ జయలక్ష్మి(అంతులేని కథ); కునాల్సింగ్(మృతి 2008 ఫిబ్రవరి 7); సునందిని(జగమే మాయ హీరోయిన్); లీలారాణి (బడిపంతులులో నటించింది). ఇదే కోవలో విజయశ్రీ, మధుమాలిని, ఆంచల్ లాంటి నటీమణులూ ఉన్నారు. టీవీ తారల్లో మొన్నటి ప్రత్యూష, నిన్నటి లక్ష్మీ సుజాత ఉన్నారు. ఇక ఆర్తి అగర్వాల్, ఉదయభానులలాగా చివరి క్షణాల్లో బతికి బయటపడినవారూ ఉన్నారు.