Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'అష్టాచెమ్మ' ప్రాణం తీసింది
ఇలాంటి ఘటనలకు అసూయే అసలు కారణమని పోలీసు అధికారులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతలతోపాటు అదే స్థాయిలో అపార్థాలకూ నిలయమైన సినీ పరిశ్రమలో ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయని ఓ ఉన్నతాధికారి విశ్లేషించారు. సినీ పరిశ్రమలో నటీనటులు ఒకరికొకరు సన్నిహితంగా ఉండటం మామూలు విషయమని, ఇదే అనేక రకాల అపార్థాలకు తావిస్తోందని, అడపాదడపా ప్రాణాంతకంగా మారుతోందని ఆ అధికారి వివరించారు. అందుకే సినీ వ్యామోహంతో రాజధానికి చేరుకునే వారు ముఖ్యంగా యువతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సినిమాల బిజీలో స్నేహితుల్నీ.. బంధువుల్నీ పట్టించుకోకపోవడం అపార్థాలకు దారితీస్తోందని ఆయన అంటున్నారు.
ఈ సందర్భంగా ఇదే తరహాలో మరణించిన ప్రత్యూష లాంటి మరికొందరు పేర్లు సైతం ప్రస్తావనకు వస్తున్నాయి. వారిలో శోభ(మనవూరి పాండవులు); దివ్యభారతి (మృతి 1993 ఏప్రిల్ 5); సిల్క్స్మిత(మృతి 1996 సెప్టెంబరు 23); అలేఖ్య(పెళ్లిసందడిలో నటించింది.. మృతి 2007 ఆగస్టు 8); ఫటాఫట్ జయలక్ష్మి(అంతులేని కథ); కునాల్సింగ్(మృతి 2008 ఫిబ్రవరి 7); సునందిని(జగమే మాయ హీరోయిన్); లీలారాణి (బడిపంతులులో నటించింది). ఇదే కోవలో విజయశ్రీ, మధుమాలిని, ఆంచల్ లాంటి నటీమణులూ ఉన్నారు. టీవీ తారల్లో మొన్నటి ప్రత్యూష, నిన్నటి లక్ష్మీ సుజాత ఉన్నారు. ఇక ఆర్తి అగర్వాల్, ఉదయభానులలాగా చివరి క్షణాల్లో బతికి బయటపడినవారూ ఉన్నారు.