విక్రమ్, త్రిష జంటగా నటించిన 'భీమా' చిత్రం తెలుగులో ఇప్పుడే విడుదల కాకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. విక్రమ్ భీమా చిత్రానికి ఎంతో క్రేజ్ ఏర్పడింది. అయితే తమిళంలో ఈ సినిమా విడుదలైంది. కానీ ప్రేక్షకులు ఆదరణ ఆశించినంతగా లేదట. తమిళంలో యావరేజీగా ఆడుతోందని అంటున్నారు. ఈ దెబ్బతో తెలుగులో సినిమాను అదే పద్ధతిలో విడుదల చేయకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. ట్రాజిక్ ముగింపును సవరించి తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సవరణకు సమయం ఎక్కువే తీసుకుంటుంనడంలో సందేహం లేదు.