twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భీష్మ' చిత్రం ఆగిపోనుందా?

    By Staff
    |

    బెల్లంకొండ సురేష్ పైన కాల్పుల వుదంతం తర్వాత బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ ల కాంబినేషన్ లో అట్టహాసంగా మొదలైన చిత్రం 'భీష్మ'. 'రైడ్' చిత్ర దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం ఆగిపోనుందా? అవుననే అంటున్నారు ఫిలింనగర్ జనాలు. బాలకృష్ణ వీరాభిమానిగా చెలామణి అవుతూ ఆయనతో ''చెన్నకేశవ రెడ్డి'', "లక్ష్మీనరసింహ" లాంటి చిత్రాలు నిర్మించిన బెల్లంకొండ, కాల్పుల ఉదంతం తర్వాత తిరిగి బాలకృష్ణకు దగ్గర కావాలన్న ప్రయత్నంలో రైడ్ చిత్ర ఆడియోను బాలయ్య చేతుల మీదుగానే విడుదల చేయించారు. తర్వత ఆయనతో ఏదోలా 'భీష్మ' చిత్రంలో నటించేందుకు ఒప్పించాడు.

    కానీ విశ్వసనీయ కథనం ప్రకారం బాలకృష్ణ కుటుంబసభ్యులకు ఆయనీ చిత్రంలో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదట. దీంతో వారి ఒత్తిడికి తలొగ్గిన బాలయ్య ఈ ప్రాజెక్టు వదులుకోవడానికి సిద్ధమయ్యారట. నేరుగా సినిమా చెయ్యడం ఇష్టం లేదని చెప్పకుండా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట. ''గుడ్డి వాడికి కళ్లు తెప్పించగలం కానీ గుడ్డి వాడిగా నటించేవాడికి తెప్పించడం కష్టం" అనుకున్న రమేష్ వర్మ తన చిత్రం కోసం హీరోను వెదిగే పనిలో పడ్డారట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X