'ఆంజనేయులు' డైరక్టర్ నెక్ట్స్ ఎవరితోనంటే...
రవితేజ, నయనతార కాంబినేషన్లో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందించిన పరుశరామ్ తాజాగా మరో స్క్రిప్టు ఓకే చేయించుకున్నారని సమాచారం. మగధీర, ఆర్య-2 చిత్రాల సహ నిర్మాతగా వ్యవహరించిన భోగవల్లి ప్రసాద్..పరుశరామ్ కథ నచ్చి సినిమా చేయటానికి ముందుకువచ్చారని తెలుస్తోంది. ఆంజనేయులు ఘోరంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో దర్శకుడుగా పరుశరామ్ కి గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ ని సద్వినియోగం చేసుకుని మంచి స్క్రిప్టు రూపొందించాడని తెలుస్తోంది. ఇక పరుశరామ్ కిది మూడో చిత్రం. మొదటి చిత్రం నిఖిల్ హీరోగా రూపొందిన యువత. అలాగే పరుశరామ్..ప్రముఖ దర్శకుడు పూరీ దగ్గర పనిచేసారు. ఇక ఈ కొత్త చిత్రం ఓ క్రేజీ హీరోతో ఉండనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
More from Filmibeat
రవితేజ నయనతార ఆంజనేయులు భోగవల్లి ప్రసాద్ పూరీ జగన్నాధ్ మగధీర ravi teja nayantara anjeneyulu bhogavalli prasad puri jgannath magadheera


Click it and Unblock the Notifications











