Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రీ ఎంట్రీ ఖరారు చేసిన భూమిక
ముంబై: "అవును, నేను ఆ సినిమా చేస్తున్నాను. కాని ఇప్పుడు నా క్యారక్టర్ ఏమిటనేది రివీల్ చేయలేను. చాలా గ్యాప్ తర్వాత హిందీ చిత్రం చేస్తూండటంతో చాలా ఎక్సైటింగ్ గా ఉంది ," అన్నారు భూమిక.
భారత క్రికెట్ వన్డే జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'ఎం.ఎస్.ధోని- ది అన్టోల్డ్ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మన తెలుగు మాజీ హీరోయిన్ భూమిక ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లడ్డూ బాబు.
గతంలో ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో తేరే నామ్, దిల్ నే జైసీ అప్నే కహా, గాంధీ మై ఫాధర్ వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఇక్కడ కూడా చేయటం మానేసింది. అయితే తాజాగా ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి 'బేబి, స్పెషల్ 26, ఎ వెడ్నెస్డే' వంటి వినూత్న చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోని పాత్రలో హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నారు. చిత్రంలో అప్పటి ధోని సహచరులు నటించనున్నారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ధోనీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు.
చిత్రం స్క్రిప్ట్ చదివానని అద్భుతంగా ఉందని నటుడు అనుపమ్ ఖేర్ దర్శకుడిని అభినందించారు. నీరజ్ పాండే తన అభిమాన దర్శకుడని, ఆయన స్క్రిప్ట్ రూపొందించే విధానం అద్భుతంగా ఉంటుందని ఆయన కితాబిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన 'బేబి' చిత్రం స్క్రిప్ట్ని ఆస్కార్ లైబ్రరీలో ఉంచేందుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.