Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రీ ఎంట్రీ ఖరారు చేసిన భూమిక
ముంబై: "అవును, నేను ఆ సినిమా చేస్తున్నాను. కాని ఇప్పుడు నా క్యారక్టర్ ఏమిటనేది రివీల్ చేయలేను. చాలా గ్యాప్ తర్వాత హిందీ చిత్రం చేస్తూండటంతో చాలా ఎక్సైటింగ్ గా ఉంది ," అన్నారు భూమిక.
భారత క్రికెట్ వన్డే జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'ఎం.ఎస్.ధోని- ది అన్టోల్డ్ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మన తెలుగు మాజీ హీరోయిన్ భూమిక ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లడ్డూ బాబు.
గతంలో ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో తేరే నామ్, దిల్ నే జైసీ అప్నే కహా, గాంధీ మై ఫాధర్ వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఇక్కడ కూడా చేయటం మానేసింది. అయితే తాజాగా ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి 'బేబి, స్పెషల్ 26, ఎ వెడ్నెస్డే' వంటి వినూత్న చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోని పాత్రలో హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నారు. చిత్రంలో అప్పటి ధోని సహచరులు నటించనున్నారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ధోనీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు.
చిత్రం స్క్రిప్ట్ చదివానని అద్భుతంగా ఉందని నటుడు అనుపమ్ ఖేర్ దర్శకుడిని అభినందించారు. నీరజ్ పాండే తన అభిమాన దర్శకుడని, ఆయన స్క్రిప్ట్ రూపొందించే విధానం అద్భుతంగా ఉంటుందని ఆయన కితాబిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన 'బేబి' చిత్రం స్క్రిప్ట్ని ఆస్కార్ లైబ్రరీలో ఉంచేందుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.