Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!
Recommended Video
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ అనుకోని కారణాలతో తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు బ్రేక్ పడింది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను తాను అనుకున్న విధంగా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన బాలయ్య తన వందో చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి పేరు వెల్లడించారు.
మొనగాడు ‘‘యన్. టి. ఆర్’’
జనని భారతి మెచ్చ... జగతి హారతులెత్త... జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..రణభేరి మ్రోగించె తెలుగోడు..జయగీతి నినదించె మొనగాడు..‘‘యన్. టి. ఆర్'' అని పేర్కొన్న బాలయ్య ఆ నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు, నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాము.. అని వెల్లడించారు.
వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది.
చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది..ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది..ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్ జాగర్లమూడి', ఈ చరిత్రకు చిత్ర రూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను.... అని బాలయ్య తెలిపారు.
ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం
ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం... ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం..నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది... అని బాలయ్య తెలిపారు.
మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను: క్రిష్
బాలయ్య ప్రకటనపై దర్శకుడు క్రిష్ స్పందించారు. ‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను' అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్
ఎన్.బి.కె ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం బేనర్లో విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తుండగా, రామకృష్ణ సబ్బని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 2019 సంక్రాంతికి మూవీ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.