Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో సాక్ష్యం: అమితాబ్కు మూడినట్లేనా?
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన గొడవల్లో అనేక వందల మంది సిక్కు యువకులు ఊచకోతకు గురైన విషయం తెలిసిందే. ఇందిర తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురి కావడమే ఇందుకు కారణం. ఈ గొడవలు అమితాబ్ కారణంగానే జరిగాయని, ఆయన రెచ్చగొట్టుడు వ్యాఖ్యల వల్లనే మారణ హోమం జరిగిందని సిక్కు సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఆయపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇందిరా గాంధీ అభిమాని, ఆమెను అమ్మగా ఆరాధించే అమితాబ్....ఆమె మరణం తర్వాత హత్యకు హత్యే ప్రతీకారం అంటూ సిక్కులకు వ్యతిరేకంగా స్లోగన్లు చేశాడనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు.
ఈ కేసులో మరొకరు అమితాబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారు. 52 సంవత్సరాల మంజిత్ సింగ్ అనే వ్యక్తి అమితాబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి రెడీ అయ్యారు. అమితాబ్ సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారు మంజిత్ సింగ్. అమితాబ్ పై చర్యలు తీసుకోవాలంటూ గత కొంత కాలంగా సిక్కు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. మరి ఈ వ్యవహారం ఇంకెంత వరకు వెలుతుందో? నిజంగానే అమితాబ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనేది కాలమే నిర్ణయించాలి.