twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సాక్ష్యం: అమితాబ్‍‌కు మూడినట్లేనా?

    By Bojja Kumar
    |

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన గొడవల్లో అనేక వందల మంది సిక్కు యువకులు ఊచకోతకు గురైన విషయం తెలిసిందే. ఇందిర తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురి కావడమే ఇందుకు కారణం. ఈ గొడవలు అమితాబ్ కారణంగానే జరిగాయని, ఆయన రెచ్చగొట్టుడు వ్యాఖ్యల వల్లనే మారణ హోమం జరిగిందని సిక్కు సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఆయపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇందిరా గాంధీ అభిమాని, ఆమెను అమ్మగా ఆరాధించే అమితాబ్....ఆమె మరణం తర్వాత హత్యకు హత్యే ప్రతీకారం అంటూ సిక్కులకు వ్యతిరేకంగా స్లోగన్లు చేశాడనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు.

    ఈ కేసులో మరొకరు అమితాబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారు. 52 సంవత్సరాల మంజిత్ సింగ్ అనే వ్యక్తి అమితాబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి రెడీ అయ్యారు. అమితాబ్ సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారు మంజిత్ సింగ్. అమితాబ్ పై చర్యలు తీసుకోవాలంటూ గత కొంత కాలంగా సిక్కు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. మరి ఈ వ్యవహారం ఇంకెంత వరకు వెలుతుందో? నిజంగానే అమితాబ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనేది కాలమే నిర్ణయించాలి.

    English summary
    Trouble seems to be brewing up for Bollywood star Amitabh Bachchan after another witness alleged his role in the 1984 Sikh riots. 52-year-old Manjit Singh Saini, based in California alleged that he saw the actor shouting anti-Sikh slogans and pointing towards a Sikh in a crowd at the All India Institute of Medical Sciences, New Delhi on October 31, 1984.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X