Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ చూడనున్న ఏపీ హైకోర్టు!.. నాగార్జునకు నోటీసులు, షో ఆగిపోనుందా?
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కు ఇప్పుడిప్పుడే రేటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా గుర్తుంపు తెచ్చుకున్న బిగ్ బాస్ పై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ సీజన్ లో ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. తెలుగులో ఇప్పటివరకు ఐదీ టెలివిజన్, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకన్నా ఈ షో ఆరో సీజన్ ఎనిమిదో వారానికి చేరుకుంది. అయితే ఈ బిగ్ బాస్ రియాలిటీ షోని నిలిపివేయాలంటూ ఇప్పటికీ చాలా మంది పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునకు నోటీసులు పంపింది.
ఎనిమిదో వారంలోకి..
రియాలిటీ షో అనే పేరుకు తగినట్లుగానే నిజమైన సంఘటనల ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిమాణాలు.. ట్విస్టులతో సాగుతోంది బిగ్ బాస్ తెలుగు 6 షో. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది ఈ రియాలిటీ షో.
ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా ఐదు టెలివిజన్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల అంటే సెప్టెంబర్ 4న ఆరో సీజన్ కూడా ప్రారంభించారు. ఎన్నో అంచనలా నడుమ ప్రారంభమైన ఈ ఆరో సీజన్ ఆసక్తిగా సాగుతోంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 54 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది.
అశ్లీలత ఎక్కువైన కారణంగా..
ఇక ఇదిలా ఉంటే ఈ రియాలిటీ షోకి ప్రేక్షకాదరణ ఎంత ఉందో.. అంతకు మించి విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ షోపై మరోసారి వివాదం చెలరేగింది. ఈ షోని నిలిపివేయాలంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ రియాలిటీ షోలో అశ్లీలత ఎక్కువైందని, కుటుంబంతో కలిసి చూడాలంటే ఇబ్బందిగా ఉందని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేస్తూ ఆరోపించారు. ఈ షోలో అశ్లీలత ఎక్కువైన కారణంగా, చట్ట ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని కోరారు.
కౌంటర్ దాఖలు చేయాలని..
ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు గతంలోనే రెండు మూడు ఎపిసోడ్స్ చూస్తామని తెలిపింది. ఎలాంటి సెన్సార్ షిప్ లేకుండా ప్రసారం అవుతోందన్న పిటిషనర్ ఆరోపణలతో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు షో నిర్వాహకులతోపాటు, హోస్ట్ నాగార్జునకు కూడా నోటీసులు పంపింది.
వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అశ్లీల, హింసాత్మక, అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్ బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని 2019లో కూడా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. మరి ఈ విచారణ బిగ్ బాస్ షోను నిలిపివేసేంత వరకు వెళ్తుందో.. ఇంకేమైన ట్విస్ట్ లు ఉంటాయో వేచి చూడాలి.