Don't Miss!
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వాళ్లంతా కుక్కలు అన్న కౌశల్.. కలకలం రేపుతున్న వీడియో
తెలుగు రియాలిటీ షో 'బిగ్బాస్' ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఇదే షో కొందరిని తొక్కేయగా, మరికొందరిని మాత్రం ప్రేక్షకుల ముందు హీరోలను చేసింది. ఇలా పాపులర్ అయిన వాళ్లలో ప్రముఖ నటుడు కౌశల్ మండా ఒకరు. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్లో ప్రసారమైన బిగ్బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ స్టార్ అయిపోయాడు.
గెలిపించిన సానుభూతి
ఆ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.
పోస్టుతో కెలుక్కున్నాడు
బిగ్బాస్
విన్నర్
అయినప్పటి
నుంచి
అడపాదడపా
మీడియా
ముందుకు
వస్తున్న
కౌశల్..
తాజాగా
సోషల్
మీడియాలో
ఓ
పోస్ట్
చేశాడు.
తన
ఇన్స్టాగ్రామ్
ఖాతాలో
బిగ్బాస్
సీజన్-2లో
జరిగిన
ఓ
సంఘటనతో
ఉన్న
ఓ
వీడియోను
పోస్ట్
చేసిన
కౌశల్
‘‘నేను
నన్ను
మాత్రమే
నమ్ముతాను.
అదే
నా
విజయ
రహస్యం.
నా
వెనుక
నుంచి
మాట్లాడుకునే
వాళ్ల
గురించి
నేనస్సలు
పట్టించుకోను.
కేవలం
మీరు
ఇది
ఫాలో
అయితే
చాలు.
జీవితంలో
సక్సెస్
అయిపోవచ్చు''
అంటూ
క్యాప్షన్
పెట్టాడు.
కౌశల్పై ట్రోలింగ్
ఈ పోస్టు చూసిన తర్వాత దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీనిని సమర్ధిస్తుండగా, మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. పోస్టు వరకు బాగానే ఉన్నా.. ఆ వీడియోలో కౌశల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అందులో నూతన్ నాయుడితో మాట్లాడుతూ.. కుక్కలు మొరిగితే పట్టించుకోను అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అప్పుడు ఏదో ప్రస్టేషన్లో మాట్లాడిన వ్యాఖ్యలను ఇప్పుడు షేర్ చేయడమేంటని తనీష్, గీతా మాధురి, బాబూ గోగినేని, దీప్తీ సునయన ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
కౌశల్ ఆర్మీ కాంట్రవర్శీ
కొద్దిరోజుల క్రితం కౌశల్ ఆర్మీ గురించి పెద్ద వివాదమే చెలరేగింది. కౌశల్ ఆర్మీ పేరిట తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని కొందరు మీడియా ముందుకు వచ్చారు. ఇది చిలికిచిలకి గాలి వానలా మారింది. ఆ తర్వాత ఈ వివాదం ఓ న్యూస్ చానెల్ వైపు మళ్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ముగిసిపోయింది.