Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘బిందాస్’ లోగో ఆవిష్కరణ
ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మంచు మనోజ్ కుమార్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. షీనా నాయిక. వీరు పొట్ల దర్శకుడు, సుకర రామబ్రహ్మం నిర్మాత. ఈ చిత్రానికి 'బిందాస్" అనే పేరుని పెట్టారు'అజయ్ గాడి విజయగాధ" ఉప శీర్షిక. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరై చిత్రం లోగోని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 'బిందాస్" అనే పేరు యువతను ఆకట్టుకునేలా ఉందన్నారు. మోహన్ బాబు కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కో తరహా నటనను ప్రదర్శిస్తుంటారు. మనోజ్ ప్రతిభ గల నటుడు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మనోజ్ మాట్లాడుతూ అన్నయ్య బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతోంది టాకీ పూర్తయింది. పాటలతో పాటు మిగిలిన భాగాన్ని పూర్తిచేసి చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షీనా, వీరుపొట్ల, సుంకర రామబ్రహ్మం, కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.