Don't Miss!
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిందు మాధవి మాటలుకి నవ్వుకుంటున్నారు
'ఆవకాయ్ బిర్యానీ" చిత్రం ద్వారా 2008లో తెలుగుతెరపై అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి బిందుమాధవి. ఆ తర్వాత పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్కు జోడీగా బంపర్ ఆఫర్, ఓం శాంతి (2009), రామరామ కృష్ణ కృష్ణ, ప్రతిరోజు (2010) చిత్రాల్లో నటించింది. కానీ ఏవీ ఆమెకు లైఫ్ ఇవ్వలేదు. అలాగే ఈ చిత్రాలతో పాటు మరో మూడు తమిళ చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం 'పిల్ల జమీందార్"లో నాని సరసన చేస్తున్న ఈ ముద్దుగుమ్మని ఏంటీ గ్యాప్ అని మీడియావారు అడిగారు.దానికామె ఆపర్స్ వస్తున్నాయి కానీ.. వస్తున్న అవకాశాల్లో నచ్చితేనే చేస్తున్నట్లు శెలవిచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం కంటే వాటిలో మంచివి ఎంచుకొని చేయడమే ఉత్తమం. అలా చేస్తేనే పరిశ్రమలో పదికాలాల పాటు హీరోయిన్గా నిలదొక్కుకోవచ్చునంటూ బిల్డప్ ఇచ్చింది. ఇది విన్న పరిశ్రమ జనాలు బిందుకు అంత సీన్ ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఆమె మాటలు విని నవ్వుకుంటున్నారు.
కొన్ని కారణాల వల్ల ఓ జమీందారీ కుర్రాడు సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది. దేనికోసం అలా జరిగిందన్న ప్రధానాంశంతో 'పిల్ల జమీందార్' చిత్రాన్ని మలుస్తున్నారు. నాని, హరిప్రియ, బిందుమాధవి హీరోహీరోయిన్లుగా అశోక్ దర్శకత్వంలో ఎస్.ఎస్. సినిమాస్ పతాకంపై ఎస్.ఎస్. బుజ్జిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు డి.యస్.రావు మాట్లాడుతూ, 'వినోదాత్మక కుటుంబ కథాచిత్రమిది. కథానాయకుడి పాత్ర చిత్రణ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. వినోదానికి ప్రాధాన్యమిస్తూ దర్శకుడు అశోక్ చిత్రాన్ని ఎంతో బాగా తీర్చిదిద్దారు. యువతరాన్ని అలరించే అంశాలతో పాటు కుటుంబమంతా కలసి చూసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. వచ్చేవారంలో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఆడియోను, దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాం' అని అన్నారు.