Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'బిందుమాధవి' లక్కీ ఛాన్స్
పరభాషా కథానాయికల మోజులో పడ్డ మన తెలుగు సినిమా దర్శకులు తెలుగమ్మాయిలను ఆదరించిన దాఖలాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. లయ తర్వాత మరే కథానాయిక చెప్పుకోదగ్గరీతిలో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయారు. శేఖర్ కమ్ముల స్కూల్ నుండీ వచ్చిన అనీష్ దర్శకత్వంలో వచ్చిన 'ఆవకాయ్ బిర్యాని' చిత్రం ద్వారా వెండి తెరపై మెరిసిన పదహారణాల తెలుగమ్మాయి బిందుమాధవి. తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలిపోయినా బిందు నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుసగా అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి.
ప్రస్తుతం వైష్ణో అకాడమీ పతాకంపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న 'బంపర్ ఆఫర్' చిత్రంలో సాయి రాం శంకర్ తో నటిస్తున్న బిందుకి దిల్ రాజు నిర్మించే చిత్రంలో నటించే సువర్ణావకాశం దొరికింది. రామ్ హీరోగా లక్ష్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' లో బిందు ఓ కథానాయికగా నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రియా ఆనంద్(శేఖర్ కమ్ముల లీడర్ ఫేం) మరో నాయిక. ప్రముఖ కథానాయకుడు అర్జున్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి బిందుమాధవి కెరీర్ 'మూడు పువ్వులు, ఆరు కాయలు' గా వెలుగొందాలని ఆసిద్దాం.