Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అసలైన కథలకు సిసలైన డిమాండ్... అభిమానుల ఎదురుచూపులు
టాలీవుడ్ లో కొత్త కథలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటుండటంతో రైటర్లు తమ బుర్రలకు మరింత పదును పెడుతున్నారు. అయితే, పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు వినోదం పంచేందుకు షార్ట్ కట్ లు కూడా ఫాలో అవ్వాల్సి వస్తోంది. అలాంటి షార్ట్ కట్ ల్లో బయోపిక్ లు సింహ భాగాన్ని ఆక్రమిస్తున్నాయి.
ఇక మహానటి పుణ్యమాని తెలుగునాట బయోపిక్ లు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో, ఓ సినిమాకు సరిపోయే స్టఫ్ ఉన్న వారి జీవిత కథలను కాచి వడబోస్తున్న సినీ జనం, పలు ఇంట్రెస్టింగ్ బయోపిక్ లతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శక -నిర్మాత దాసరి నారాయణ రావు, ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్ జీవిత చరిత్రలను తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది.
డైరెక్టర్ తేజ, రామ్ గోపాల్ వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తెరకక్కించేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, స్టార్ డైరెక్టర్ అయిన దాసరి, లైపోసెక్షన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆర్తీ జీవితాలను తెర మీద ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాసరి జీవిత చరిత్ర భారీ స్థాయిలో తెరకెక్కనుండగా, ఉదయ్, ఆర్తీల బయోపిక్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ల కోసం ముస్తాబు అవుతున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి సినీ ప్రియులను ఈ బయోపిక్ లు ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.