Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రిక్షా ఎక్కి జిమ్ కి వెళ్ళిన సెక్సీ బ్యూటీ
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు రీసెంట్ గా ముంబయి నగరంలో రిక్షా సవారి చేసింది. ఈ విషయంపై ఆమె ట్వీట్ చేస్తూ..మోడల్గా ఉన్న రోజుల్లో రిక్షాలోనే తిరిగేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొచ్చాయని అంది. ఇంతకీ ఆమె రిక్షా ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే. ఇటీవల బాగా పొద్దుపోయే వరకూ ఆమె షూటింగ్లో పాల్గొంది. ఉదయం అయిదు గంటలకు వ్యాయామశాలకు వెళ్లడం బిపాసా అలవాటు. ఆ సమయానికి డ్రైవర్ కారు తీసుకొని రాలేదు. సమయానికి కారు అందుబాటులో లేకపోవడంతో మరో దారి లేక అందుబాటులో ఉన్న రిక్షా ఎక్కి జిమ్కి వెళ్లింది.
ఇక ప్రస్తుతం ఆమె మాధవన్ తో కలిసి 'జోడీ బ్రేకర్స్'చిత్రం చేస్తోంది. అయితే మాధవన్, బిపాసాబసు కలిసి నటించటంపై అందరూ వింతగా చెప్పుకుంటున్న తరుణంలో మాధవన్ మాత్రం తమ జోడీ తెరపై మెరుపులు కురిపిస్తుందని చెప్పుకుంటున్నాడు. ''బిపాసా, నేను వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండిస్తామని భావిస్తున్నా'' అని తెలిపాడు. రొమాంటిక్ కామెడీ చిత్రం 'జోడీ బ్రేకర్స్'కు అశ్వనీ చౌధరి దర్శకత్వం వహిస్తున్నారు. జంటలను విడగొట్టడమే పనిగా పెట్టుకునే మాధవన్, బిపాసా చివరకు ఎలా ప్రేమలో పడ్డారనేది చిత్ర కథ. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఆ చిత్రంలో ఓమి వైద్య, మిలింద్ సోమన్, తదితరులు నటిస్తున్నారు.