Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ హీరో శివాజీపై దాడికి యత్నం.. చేసింది ఎవరంటే?
తెలుగు సినీ నటుడు శివాజీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ఏపీలో ఇలాంటి దాడులు ఇంతకు ముందు జరుగకపోవడం, ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తున్న నేతపై దాడికి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. గత కొద్దికాలంగా ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని శివాజీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
శివాజీపై బీజేపీ కార్యకర్తల వాగ్వాదం
బుధవారం ఉదయం నటుడు శివాజీ విమానంలో విజయవాడకు చేరుకొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో శివాజీకి బీజేపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఆయనతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆగ్రహం చెందిన కార్యకర్తలు శివాజీపై దాడికి ప్రయత్నించారు.
కన్నా సమక్షంలోనే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొన్న సందర్భంగానే శివాజీపై దాడి ఘటన చోటుచేసుకొన్నది. కన్నాను ఆహ్వానించేందుకు వచ్చిన కార్యకర్తలు శివాజీపై దాడికి యత్నం చేశారు.
మోదీని తిడుతావా?
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై మండిపడుతున్న శివాజీపై దూషించారు. నోటికి వచ్చినట్టు తిట్టడం కాదని బెదిరించారు. కొంత మంది కార్యకర్తలు శివాజీపైకి దూసుకెళ్లారు. ఆ సమయంలో కొంత మంది ఆయనపై దాడికి యత్నించారు. దీంతో విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సకాలంలో రంగ ప్రవేశం చేసి శివాజీకి రక్షణగా నిలిచారు.
బీజేపీ దాడులకు భయపడను
బీజేపీ కార్యకర్తల తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడేది లేదు అని శివాజీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా సిద్దమే అని అన్నారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని వదిలిపెట్టేది లేదు అని శివాజీ అన్నారు.