Don't Miss!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు: బిగ్ ట్రబుల్లో సోనాలి, సైఫ్, టబు.. మళ్ళీ జైలుకేనా!
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు నీడలా వెంటాడుతోంది. కొన్ని నెలల క్రితం జోధ్ పూర్ న్యాయస్థానం కృష్ణ జింకల కేసులో తుది తీర్పు వెల్లడించింది. సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్ణయిస్తూ ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మిగిలిన వారందరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తరువాత సల్మాన్ ఖాన్ బెయిలుపై బయటకు వచ్చాడు. తాజగా మరో మారు ఈ కేసు సంచలనంగా మారింది.
మళ్ళీ తిరగేశారు
కృష్ణ జింకల కేసులో జోధ్ పూర్ న్యాయస్థానం సల్మాన్ ఖాన్ ని మాత్రమే దోషిగా ప్రకటించింది. మిగిలిన నిందితులైన సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం లని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసుని రాజస్థాన్ ప్రభుత్వం మళ్ళీ తిరగేసింది.
నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ
సోనాలి, టబు, సైఫ్, నీలం నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. దీనితో విముక్తి లభించిందని భావించిన టబు, సోనాలి, సైఫ్, నీలం మెడకు ఈ కేసు మరో మారు బిగుసుకునట్లు అయింది.
బిగ్ ట్రబుల్
సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే శిక్ష ఖరారైంది. బెయిలు తెచ్చుకుని ఈ కేసు విషయంలో సల్మాన్ సుప్రీం కోర్టులో పోరాడుతున్నాడు. మరో మారు ఈ కేసుని న్యాయ స్థానం పరిశీలిస్తే టబు, సోనాలి, సైఫ్ తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే.
20 ఏళ్ల క్రితం
దాదాపు 20 ఏళ్ల క్రితం నమోదైన కేసు ఇప్పటికీ వీరిని వెంటాడుతోంది. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ లో భాగంగా వీళ్లంతా రాజస్థాన్ వెళ్లారు. అక్కడ బిష్ణోయ్ సమాజం వారు బిడ్డల్లా చూసుకునే కృష్ణ జింకలని వేటాడి చంపారనే కేసు సల్మాన్, సైఫ్, టబుపై నమోదైంది.