Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కాలుష్య కోరల్లో ఎలా బ్రతుకుతున్నారు? ఈ నగరానికేమైంది? ఢిల్లీ పొల్యూషన్పై ప్రియాంక చోప్రా రియాక్షన్
Recommended Video
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రజలు బయటికిరాలేని పరిస్థితి నెలకొంది. కాలుష్యం స్థాయి మితిమీరి తొలిసారిగా వెయ్యి పాయింట్లు కూడా దాటేసింది. దీంతో వాతావరణం మొత్తం విషపూరితంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ వివరాలు చూద్దామా..
నగరం మొత్తం దట్టంగా పొగమంచు.. స్కూళ్లకు సెలవులు
ఢిల్లీ నగరంలో కాలుష్యం కారణంగా గత కొన్నిరోజులుగా నగరం మొత్తం దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచులో తీవ్రస్థాయిలో హానికర వాయువులు చేరాయని కాలుష్య నియంత్రణ బోర్డు కూడా ప్రకటించింది. వాయుకాలుష్యం కారణంగా పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించేశారు.
షూటింగ్ నిమిత్తం ప్రియాంక చోప్రా.. తట్టుకోలేకపోతున్నా అంటూ
'ది వైట్ టైగర్' సినిమా షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్ళింది ప్రియాంక చోప్రా. ఈ సందర్బంగా ఢిల్లీలో నెలకొన్న కాలుష్య తీవ్రత చూసి చలించిపోయి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ కాలుష్య భూతాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో షూటింగులో పాల్గొనలేకపోతున్నా అంటూ ట్వీట్ చేసింది.
|
ఈ కాలుష్యం కోరల్లో ఎలాగో!
ఈ మేరకు ముఖానికి మాస్క్ ధరించి ఉన్న తన ఫోటోని షేర్ చేసింది ప్రియాంక చోప్రా. ''షూట్ డేస్ ఫర్ ది వైట్ టైగర్.. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈ కాలుష్యం కోరల్లో ఎలా జీవించాలో అర్థం కావడంలేదు. ఎయిర్ ప్యూరిఫయిర్స్, మాస్కులు మమ్మల్ని రక్షిస్తున్నాయి. ఇళ్ళు లేని వాళ్లకు రక్షణ కావాలని ప్రరతీస్తున్నా. అందరూ సేఫ్ గా ఉండాలి'' అని ప్రియాంక తన పోస్ట్లో రాసుకొచ్చింది. ఈ మేరకు ఎయిర్ పొల్యూషన్..ఢిల్లీ పొల్యూషన్.. వి నీడ్స్ రైట్ టు బ్రెత్ టు ది పోస్ట్ అని ట్యాగ్ చేసింది.
మోటివేషనల్ కథాంశం 'ది వైట్ టైగర్'
రామిన్ భరణి తెరకెక్కిస్తున్న 'ది వైట్ టైగర్' సినిమాలో ప్రియాంక ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఒక పల్లెటూరిలో టీ షాప్ పెట్టుకున్న ఓ యువకుడు పెద్ద వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడనే మోటివేషనల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ముకుల్ డోరా, శ్రీ రాజ్ కుమార్ రావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.