Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చీ యాక్క్..! అన్నారు: బాహుబలి తర్వాత ఇప్పటికి మొదటి హిట్ ఇదే
నిజానికి హిట్ అన్నమాట బాలీవుడ్ లో బాహుబలి 2 తర్వాత వినిపించనే లేదు ఇప్పుడు ఆ చింత టాయిలెట్ తో తీరి పోయింది
టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా పేరు వినగానే చాలామంది సోషల్ అవేర్నెస్ సినిమా అనుకున్నా సరే కాస్త ఎబ్బెట్టుగా మొహం పెట్టారు. మరీ ఇంత "ఇదిగా" టైటిల్ పెట్టకుంటే ఏంపోయిందీ అంటూ అక్షయ్నే అడిగారట. ఇంకొందరైతే నువ్వు మరీ బీ గ్రేడ్ హీరోవి కాదు సందేశాలివ్వటానికి చాలా సబ్జెక్ట్లున్నాయి మళ్ళీ ఆలోచించుకో అని సలహాలు కూడా ఇచ్చారట.
కానీ అక్షయ్ కుమార్ సందేశాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో తన స్టార్ ఇమేజ్ ను కూడా లెక్క చేయడని మరోసారి రుజువైంది. "టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథా" సినిమా అందరి మన్ననలను అందుకొని 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ను దాటుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అందరిలో ఆసక్తిని రేపింది. దేశంలో బహిర్భూమికి వెళ్లే వారి కష్టాల గురించి అలాగే స్త్రీలు ఎదుర్కునే అవమానాల గురించి చెబుతూ.. తీసిన ఈ సినిమాతో చిత్ర యూనిట్ సక్సెస్ ను అందుకుంది. నిజానికి హిట్ అన్నమాట బాలీవుడ్ లో బాహుబలి 2 తర్వాత వినిపించనే లేదు ఇప్పుడు ఆ చింత టాయిలెట్ తో తీరి పోయింది.
అయితే చిత్రం గురించి మొదట కొంత విమర్శలు వచ్చాయట. ప్రభుత్వం కోసమే అక్షయ్ ఈ సినిమా ద్వారా ప్రచారం చేస్తున్నాడని చెప్పినవారే ఇప్పుడు థియేటర్లో విజిల్స్ వేస్తున్నారని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమాధానాన్ని ఇచ్చాడు అక్షయ్. అలాగే దేశంలో ఈ సినిమా ఒక మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. గత ఎనిమిది నెలలుగా బహిర్భూమికి వెళ్లేవారి సంఖ్యా 54% నుంచి 34% వరకు వచ్చిందని. ఇప్పుడు ఆ 34 శాతం కూడా ఈ సినిమా ద్వారా సున్నాకి చేరాలని చెప్పాడు.
ఇక ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా బహిర్భూమి అనే అంశం వల్ల కలిగే ఇబ్బందులను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుందని అనుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదలు తెలిపాడు. ప్రస్తుతం అక్షయ్ ప్యాడ్ మ్యాన్ - గోల్డ్ చిత్రాలతో పాటు రజినీకాంత్ 2.0 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.