Don't Miss!
- Finance స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ నెస్లే చిన్న పిల్లల ఆహారం సెరెలాక్ లో చక్కెరను కలుపుతున్నట్లు కనుగొంది
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
బాలకృష్ణ లుక్ కోసం బాలీవుడ్ మేకప్ నిపుణులు
హైదరాబాద్:ఈ మధ్యే 'లయన్'గా సందడి చేసిన బాలయ్య....వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా 99వ సినిమా పనిలో పడిపోయారు. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం బాలయ్యని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీవాస్. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ చిత్రాలకు పనిచేసిన మేకప్ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ వార్త విన్న బాలకృష్ణ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. తమ అభిమాన హీరోని విభిన్నంగా చూడబోతున్నామనే ఆనందం వారిలో కనిపిస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కేవలం బాలయ్య లుక్ మాత్రమే కాదు కాస్ట్యూమ్స్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా తన పాత్ర విషయంలో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొంటున్నారు. ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నారు. స్లిమ్గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తులు మొదలెట్టేశారని తెలుస్తోంది.
ఇక ఈ మధ్యన వరసగా వచ్చిన చిత్రాల్లో తన పాత్రలో ఆహార్యంలో మార్పు చూపిస్తూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. పైగా దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన పాత్రలో రెండు మూడు ఛాయలు కనిపిస్తుంటాయి. దానికి తగ్గట్టు లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ సారి మరింత కొత్త లుక్ తో అదరకొట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
'లౌక్యం'తో ఇంటిల్లిపాదినీ మెప్పించారు ఈ దర్శకుడు. ఇప్పుడు బాలయ్య శైలికి తగిన కథని సిద్ధం చేశారు. ఇంటిల్లిపాదినీ మెప్పించే కథతో వస్తున్నాం.. బాలయ్య అభిమానులకే కాదు, అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రమిది అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.
ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలసి శ్రీవాస్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కార్పొరేట్ సంస్థ, ఓ దర్శకుడితో కలసి నిర్మాణంలో భాగం పంచుకోవడం తెలుగులో ఇదే మొదటిసారి. ఈ నెల 29న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ చిత్రానికి తమన్ స్వరాలు అందించడం ఇదే తొలిసారి. కోన వెంకట్, గోపీమోహన్ కథ అందించిన చిత్ర రచనలో ఎం.రత్నం, శ్రీధర్ సీపాన భాగం పంచుకొంటున్నారు.ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.