Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బొమ్మాళి రవి
అరుంధతి చిత్రంలో సోనూ సూద్ కి డబ్బింగ్ చెప్పి పేరు తెచ్చుకున్న బొమ్మాళి రవికి దశ తిరిగినట్లుంది. ఇన్నాళ్ళూ తెర వెనుక ఉండి డైలాగులు చెప్పిన ఆయన కుర్రాడు చిత్రంలో మెయిన్ విలన్ గా తెరపైకి వచ్చారు. ఆ చిత్రం వర్కవుట్ కాకపోయినా ఆఫర్స్ కి మాత్రం లోటు లేదు. తాజాగా పూరీ జగన్నాధ్ తాజా చిత్రం గోలీమార్ లో ఆయన విలన్ గా సెలక్ట్ అయ్యారని సమాచారం. గోపీచంద్ హీరోగా చేస్తున్న ఆ సినిమాలో విలన్ పాత్ర హైలెట్ అవుతుందంటున్నారు. అందులోనూ విలన్ పాత్రలను హీరోలతో సమానంగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దే పూరి దర్శకత్వంలో కాబట్టి మంచి లైప్ వచ్చినట్లే అంటున్నారు. ఇక గోపీచంద్ ఈ చిత్రంలో ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిష్టు దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నట్లు పూరీ చెప్తున్నారు. శంఖం తర్వాత గోపీచంద్ కమిటయిన చిత్రం ఇదే. అలాగే పూరీ తన ఏక్ నిరంజన్ అనంతరం చేస్తున్న చిత్రం ఇది.