Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బొమ్మాళి రవి
అరుంధతి చిత్రంలో సోనూ సూద్ కి డబ్బింగ్ చెప్పి పేరు తెచ్చుకున్న బొమ్మాళి రవికి దశ తిరిగినట్లుంది. ఇన్నాళ్ళూ తెర వెనుక ఉండి డైలాగులు చెప్పిన ఆయన కుర్రాడు చిత్రంలో మెయిన్ విలన్ గా తెరపైకి వచ్చారు. ఆ చిత్రం వర్కవుట్ కాకపోయినా ఆఫర్స్ కి మాత్రం లోటు లేదు. తాజాగా పూరీ జగన్నాధ్ తాజా చిత్రం గోలీమార్ లో ఆయన విలన్ గా సెలక్ట్ అయ్యారని సమాచారం. గోపీచంద్ హీరోగా చేస్తున్న ఆ సినిమాలో విలన్ పాత్ర హైలెట్ అవుతుందంటున్నారు. అందులోనూ విలన్ పాత్రలను హీరోలతో సమానంగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దే పూరి దర్శకత్వంలో కాబట్టి మంచి లైప్ వచ్చినట్లే అంటున్నారు. ఇక గోపీచంద్ ఈ చిత్రంలో ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిష్టు దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నట్లు పూరీ చెప్తున్నారు. శంఖం తర్వాత గోపీచంద్ కమిటయిన చిత్రం ఇదే. అలాగే పూరీ తన ఏక్ నిరంజన్ అనంతరం చేస్తున్న చిత్రం ఇది.