Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అబ్బే..మమ్మల్ని ఎవరు కొట్టారు?
సురేష్ బాబు, సునీల్ నారంగి, శ్రీధర్, జగదీష్ లు తమపై దాడిచేసారంటూ వచ్చిన వార్తలను బోణి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సరస్వతి ఫిలింస్ వారు ఖండించారు. రెండు రోజుల క్రిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసి సురేష్ బాబు రౌడీలా బిహేవ్ చేస్తున్నారని, ఆయన పరిశ్రమను మాఫియా డాన్ లా గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ చలనచిత్ర పరిరక్షణ సమితితో కలిసి వీరు ఆరోపణలు చేసారు. అయితే ఏం రాజీలు జరిగాయో గానీ అటువంటిదేమీ లేదని, వారు చాలా బాగా సహకరిస్తున్నారని మళ్లీ ప్రెస్ నోట్ విడుదల చేసారు. దాంతో వారు పిలవగానే వెళ్ళిన మీడియా వారు తెల్లముఖాలు వేసుకోవాల్సి వచ్చిందని కవర్ చేసిన వాళ్లు కామెంట్స్ చేసుకుంటున్నారు.
సరస్వతి ఫిలింస్ అధినేత బి.రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఇలా ఉంది..'బోణి' ప్రదర్శనకు ఎంపిక చేసుకున్న ఒకటి రెండు థియేటర్లకు సంబంధించి కొంత గందరగోళం నెలకొన్న సందర్భంగా పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. 'బోణి" విడుదలకు సంబంధించి సురేష్ మూవీస్ మరియు ఏషియన్ ధియేటర్స్ వారు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. 'బోణి" చిత్రాన్ని నైజాంలో ప్రదర్శించే అవకాశానిచ్చిన నిర్మాత రమణ గోగులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. బోణి చిత్రం ఈనెల 12 న విడుదల కాబోతున్నది.