Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
బొత్సా సత్యనారాయణ...కొడుకు హీరోగా సినిమా
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, పీసీసీ ప్రెసిడెంట్ బొత్సా సత్యనారాయణ పుత్రరత్నం త్వరలో సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పేరు రంజిత్. గత కొంతకాలంగా నటన, డాన్సులు, పైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్న రంజిత్ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మంత్రిగారి కొడుకు కాబట్టి సినిమా అవకాశం చాలా వీజీగానే వచ్చేసింది.
ఆయన నటించబోయే సినిమా వివరాల్లోకి వెళితే...సినిమా టైటిల్ 'ఆ ఐదుగురు', 'అతనే ఓ సీంఎం' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ఇంకా హీరో ప్రభాస్ కజిన్ సిద్ధార్థరాజ్ కుమార్, 91.6కెడిఎం ప్రేమ హీరో క్రాంతి, కృష్ణ తేజ అనే మరో నటుడు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల వద్ద పని చేసిన అనిల్ గూడురు అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆ నలుగురు, వినాయకుడు చిత్రాల నిర్మాత ప్రేమ్ కుమార్ ఈచిత్రానకి నిర్మాత. మరో విశేషం ఏమిటంటే...ఇప్పటి వరకు కేవలం పాటల రచయితగానే రాణించిన సుద్దాల అశోక్ తేజ ఈ చిత్రంతో డైలాగ్ రచయితగా పరిచయం కాబోతున్నారు.
రాజకీయాల నేపథ్యంలోనే ఈచిత్రం సాగుతుందని సినిమా టైటిల్, ట్యాగ్ లైన్ బట్టి అర్థం అవుతోంది. మరి సినిమాలో రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన ఏ మేరకు ఉంటుందో చూడాలి. హీరో బొత్సా రంజిత్ తండ్రి బొత్సా సత్యనారాయణ అడుగు జాడల్లో రాజకీయాల బాట పట్టకుండా సినిమాల బాట పట్టడం విశేషమే మరి.