Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలయ్య ఎవరిమీద..ఎందుకు గర్జించారు?
సింహాగా ఎవరి మీద.. ఎందుకు గర్జించారు అన్నది ఆసక్తికరమైన అంశం. అలాగే బాలకృష్ణ గెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటూ బాలకృష్ణ తాజా చిత్రం సింహా గురించి దర్శకుడు బోయపాటి చెప్తున్నారు. 'మిత్రుడు' సినిమా అనంతరం బాలయ్య చేస్తున్న 'సింహా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు.
''బాలకృష్ణ పాత్ర చిత్రణ, ఆయన సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆయన పాత్రలో భిన్న పార్వ్శాలుంటాయి. సింహాగా ఎవరి మీద.. ఎందుకు గర్జించారు అన్నది ఆసక్తికరమైన అంశం. అలాగే బాలకృష్ణ గెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారీదనం నిండిన ఈ సినిమాలో సంగీతానికి పెద్ద పీట వేశాం. చక్రి అందించిన బాణీలు బాగున్నాయి'' అని బోయపాటి చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో 'నేను మాట్లాడేటప్పుడు ఈ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేది పనిచేసిందో నీ నెక్ట్స్ బర్త్డే ఉండదు" వంటి బాలయ్య చెప్పే డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
శ్రీను గత చిత్రాలు 'భద్ర', 'తులసి' మాదిరిగానే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్స్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు బోయపాటి శ్రీను చెప్తున్నారు. ఇటీవలే ప్రేమ్రక్షిత్ నృత్య దర్శకత్వంలో బాలకృష్ణ , నమితలపై ఓ పాటను చిత్రీకరించారు. బాలకృష్ణ, స్నేహా ఉల్లాల్, ఆదిత్య మీనన్ తదితరులపై చిత్రీకరించిన ఉత్కంఠభరితంగా చేజ్ సీన్ కు మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పరుచూరి కిరీటి నిర్మాతగా యునైటెడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ 'సింహా' చిత్రం బాలయ్య సరసన నయనతార, స్నేహావుల్లాల్, నమిత కనిపించి అలరించనున్నారు. మిగతా ప్రధాన పాత్రలలో కె.ఆర్.విజయ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్ (మలయాళం), ఆదిత్య మీనన్, శ్రావణ్, హేమలత, జీవీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్, కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.మహేంద్రబాబు.