twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్తెర పట్టుకున్న సురేందర్ రెడ్డి.. బ్రహ్మాజీకి గుండు.. రామ్ చరణ్‌పై కామెంట్స్

    |

    మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే మొదటి సారి ఏక కాలంలో 5 భాషల్లో విడుదలైన ఈ సినిమా దేశ విదేశాల్లో కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. ఈ ప్రవాహం దర్శకనిర్మాతల్లో జోష్ నింపుతుంటే.. సైరా సినిమాలో నటించిన నటీనటులపై వస్తున్న ప్రశంసలు వారందరికీ కిక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బ్రహ్మాజీ పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ట్వీట్‌లో ఏముంది? వివరాల్లోకి పోతే..

    Recommended Video

    Ram Charan Speech At Sye Raa Narasimha Reddy Success Meet || వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలిసింది!!
    సైరాలో బ్రహ్మాజీ.. భారీ రెస్పాన్స్

    సైరాలో బ్రహ్మాజీ.. భారీ రెస్పాన్స్

    మెగా మూవీ 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో భాగమయ్యాడు నటుడు బ్రహ్మాజీ. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ రోల్ చాలా కీలకం. ఆయన పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో తన పాత్ర తాలూకు పిక్స్ షేర్ చేస్తూ తన సందేశాన్ని మెగా అభిమానులతో పంచుకున్నాడు బ్రహ్మాజీ.

     రామ్ చరణ్‌ని రిక్వెస్ట్ చేశా.. ఊహించని విధంగా

    రామ్ చరణ్‌ని రిక్వెస్ట్ చేశా.. ఊహించని విధంగా

    సైరా నరసింహా రెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారీతి కలిసి పనిచేసే అవకాశం కలిపించాలని రామ్ చరణ్‌ని రిక్వెస్ట్ చేశానని తెలిపాడు బ్రహ్మాజీ. అయితే ఈ సినిమాలో తాను కూడా ఊహించని విధంగా ఫుల్ లెంగ్త్ రోల్ తనకు కల్పించారని, చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నాడు బ్రహ్మాజీ.

     కృతజ్ఞత కూడా తక్కువే.. కత్తెర పట్టుకున్న సురేందర్ రెడ్డి

    కృతజ్ఞత కూడా తక్కువే.. కత్తెర పట్టుకున్న సురేందర్ రెడ్డి

    డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్, రత్నవేలు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనిదని, వారికెన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అని ఈ సందర్బంగా బ్రహ్మాజీ పేర్కొన్నారు. ఇక ఆయన షేర్ చేసిన పిక్‌లో బ్రహ్మాజీకి గుండు చేస్తున్నట్లుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కత్తెర పట్టుకొని ఉండటం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     సైరా 100 కోట్ల మార్క్

    సైరా 100 కోట్ల మార్క్

    ఇక కెలెక్షన్స్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసింది సైరా నరసింహా రెడ్డి మూవీ. అక్టోబర్ 2న విడుదలైన సైరా.. ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో సైరా సునామీ చూడనున్నామని అంటున్నారు.

    సైరా నరసింహా రెడ్డి విశేషాలు

    సైరా నరసింహా రెడ్డి విశేషాలు

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got possitive talk. So this movie gets huze collections worldwide. Now Brahmaji shared a tweet about Sye Raa Narasimhaa Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X