twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మలొకం టు యమలోకం వయా భూలోకం

    By Staff
    |

    డా.రాజేంద్రప్రసాద్‌, శివాజి, వేణుమాధవ్‌, ఆర్తి అగర్వాల్‌ నాయకానాయికలుగా యుతోపియా ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో సోమా విజయప్రకాష్‌ నిర్మాణ సారధ్యంలో లక్కీ మీడియా పతాకంపై గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్‌, రూపేష్‌ బి.గోహిల్‌లు నిర్మిస్తున్న 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం" చిత్రం రామానాయుడు స్టూడియోలో ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డా. డి.రామానాయుడు క్లాప్‌ నివ్వగా భూమిక భరత్‌ ఠాకూర్‌ దంపతులు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. హీరో అల్లరి నరేష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ "పూర్తి వినోదభరితమైన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 7నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి హైదరాబాద్‌, కేరళలో జరిగే సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తాం" అన్నారు. కథానాయకుడు డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ 'స్వీట్ గన్ మురగన్" సినిమా చేయడం వల్ల ఒక సంవత్సరం పాటు తెలుగు సినిమాకు దూరంగా ఉన్నాను. చాలా కాలం తరువాత ఈ చిత్రంలో నటిస్తున్నాను. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం అంటున్నారు.

    ఇందులో నేను బ్రహ్మగా నటిస్తున్నాను. స్క్రిప్ట్‌ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధిస్తుంది"" అన్నారు. మరో హీరో శివాజి మాట్లాడుతూ "రాజేంద్ర ప్రసాద్‌ గారితో గతంలో 'సందడే సందడి, శ్రీరామచంద్రులు" చిత్రాల్లో నటించాను. మా కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ఇది" అన్నారు. దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ "రంభ పాత్రలో ఆర్తి అగర్వాల్‌ నటిస్తోంది. జయప్రకాష్‌రెడ్డి యముడుగా నటిస్తున్నారు. బ్రహ్మదేవుడు భూమి మీదకు వచ్చి ఎలాంగి అనుభూతికి గురయ్యాడు అనేది చిత్ర ప్రధాన ఇతివృతం. ఇది సోషియో ఫాంటసీ అయినప్పటికీ పూర్తి వినోదాత్మకంగా వుంటుంది" అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X